50 ఏళ్ల వయసులో తండ్రైన ప్రభుదేవా..

49
- Advertisement -

భారతీయ సినీ పరిశ్రమలో మైఖెల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా మరోసారి తండ్రయ్యారు. అది 50 ఏళ్ల వయసులో. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న ప్రభుదేవా…మూడేళ్ల క్రితం పిజియోథెరపిస్ట్ హిమానీ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి పండంటి ఆడబిడ్డ జన్మించింది.

ప్రభుదేవా మొదటి భార్యకు ఇద్దరు పిల్లలున్నారు. నయనతార ఎంట్రీతో మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. అయితే తర్వాత ప్రభుదేవా- నయన్ సైతం విడిపోయారు.

Also Read:ప్రతిరోజూ పరిగెత్తితే.. ఎన్ని ప్రయోజనాలో..!

50 ఏళ్ల వయసులో ప్రభుదేవా మళ్లీ తండ్రికావడంతో నెటిజన్స్ తమదైన శైలీలో కామెంట్స్ చేస్తున్నారు. హాఫ్ సెంచరీ వయసులో మంచి గిఫ్ట్ వచ్చిందని కామెంట్స్ పోస్టు చేస్తున్నారు.తమిళ్, తెలుగు, కన్నడ,హిందీ భాషల్లో కొరియోగ్రాఫర్ గా ఫేమస్ అయ్యారు ప్రభుదేవా.

Also Read:వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల..

- Advertisement -