పదేళ్లలో సీఎస్‌కే అధినేతగా ధోని…!

310
dhoni
- Advertisement -

మహేంద్రసింగ్ ధోని పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మహీ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలిపిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో విశ్వనాథన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో పదేళ్లలో ధోని సీఎస్‌కే అధినేతగా మారతాడని జోస్యం చెప్పాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు మహీ ఉవ్విళ్లూరుతున్నాడని…ధోని మిస్టర్ కూల్,అత్యుత్తమ ఆటగాడని కొనియాడారు. ఈ సందర్భంగా ధోని చెప్పిన మాటలను గుర్తుచేశారు విశ్వనాథన్. మనపై మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలమని తన జీవితంలో దీనిని పాటించి ఎన్నో సాధించానని సీఎస్‌కే ఆటగాళ్లతో దోని చెప్పిన విషయాన్ని గుర్తుచేశాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌ కోసం ధోని కఠిన సాధన చేశాడని వెల్లడించాడు. వరల్డ్ కప్‌ తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు ధోని. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో సత్తాచాటి తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకోవాలనుకున్న మహీ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది.

- Advertisement -