స్కూల్స్ ప్రారంభం..అధికారులతో సిఎస్ టెలీకాన్ఫరెన్స్

153
cs
- Advertisement -

రాష్ట్రముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, DMHOs మరియు DPOs లతో పాఠశాలల ప్రారంభంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

పాఠశాలల్లో విద్యార్ధుల నమోదు, టీచర్ల వ్యాక్సినేషన్ లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. స్కూలు బస్ డ్రైవర్లు, మద్యాహ్నాభోజన సిబ్బంది, పారిశుధ్ధ్య సిబ్బంది పాఠశాలలకు సంబంధించి ఇతరులకు (వయోజనులు) వ్యాక్సినేషన్ వేయించాలన్నారు.

ప్రతి పాఠశాల వద్ద టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి పూర్తి వ్యాక్సినేషన్ అయినదని,కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటిస్తున్నాయని తెలియచేసే బ్యానర్ ను ప్రదర్శించాలన్నారు. పాఠశాలల్లో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, హైజీన్ చర్యలు పాటించేలా కలెక్టర్లు చూడాలన్నారు. ప్రతి రోజు పాఠశాలను శుభ్రపరచాలన్నారు.

పాఠశాలల్లో విద్యార్ధి /ఉపాధ్యాయులు /సిబ్బంది ఎవరైనా కోవిడ్ లక్షణాలతో ఉంటే వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రి, PHC లకు తీసుకువెళ్లి కోవిడ్ టెస్ట్ చేయించాలన్నారు. ఏదైనా పాఠశాల్లో కోవిడ్ పాజిటీవ్ కేసులు నమోదు ఐతే ఐసోలేషన్ చర్యలు తీసుకోవాలన్నారు. Mid day Meal సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మిగిలిపోయిన పాఠశాలలకు సంబంధించి టీచింగ్ సిబ్బంది, వయోజనులకు వ్యాక్సినేషన్ కోసం RBSK వాహానాలను వినియోగించాలన్నారు.

ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, విద్యాశాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ S.A.M రిజ్వీ, GHMC కమీషనర్ శ్రీ లోకేశ్ కుమార్, PR&RD కమీషనర్ శ్రీ రఘునందన్ రావు, ఇంటర్ మీడియెట్ విద్య కార్యదర్శి శ్రీ ఒమర్ జలీల్, సి.డి.యం.ఎ. శ్రీ సత్యనారాయణ, పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీమతి దేవసేన, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -