జిల్లా కలెక్టర్లతో సీఎస్ సోమేశ్‌ కుమార్ వీడియో కాన్ఫరెన్స్..

208
somesh kumar
- Advertisement -

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమెశ్ కుమార్ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరియు వరదల నేపధ్యంలో వాటిపై తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్లతో శనివారం బిఆర్ కెఆర్ భవన్ నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఇంకా కొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగనున్నందున జిల్లా అధికారులందరు హెడ్ క్వాటర్స్ లోనే అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్ధితులను పర్యవేక్షించి ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలన్నారు.జిల్లాల్లో రైల్వే లైన్ లకు దగ్గరగా ఉన్న చెరువులు, కుంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు సి.యస్ సూచించారు.

చెరువులు మరియు కుంటలకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పూర్తి స్ధాయి నీటి మట్టానికి చేరకముందే చెరువు కట్టలను సంరక్షించడానికి తగు చర్యలు తీసుకొవాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్లు ప్రస్తుత పరిస్ధితిని పర్యవేక్షించడానికి తమ కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూం లను ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు.

రాష్ట్ర స్ధాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు అయిందని ఎవరికైనా ఎలాంటి కష్టం ఉన్న (040-23450624) కు కాల్ చేయవచ్చని తెలిపారు.జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సి,యస్ తెలిపారు. అదనంగా గ్రామాలు మరియు పట్టణాల్లో పరిశుభ్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కూడా వారు సూచించారు. డి.జి.పి. శ్రీ మహేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఖ్యకార్యదర్శి రజత్ కుమార్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానీయా, డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, హెల్త్ అండ్ ఫామిలి వెల్ఫేర్ కార్యదర్శి శ్రీ రిజ్వి, ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీ రోనాల్డ్ రోస్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ కమిషనర్ శ్రీ రఘునందన్ రావు, ఇరిగేషన్ శాఖ ఈ ఎన్ సి శ్రీ మురళీధర్ రావు తదితర ఉన్నతాధికారులు ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

- Advertisement -