ప్రభాస్ ఫ్యాన్స్ కోసం క్రేజీ అప్ డేట్స్

12
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను(పార్ట్-1) డిసెంబర్ 22న విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 22న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం కూడా వెళ్లిందని సినీ వర్గాలు తెలిపాయి. కాగా, సినిమా విడుదలపై నిర్మాతలు త్వరలోనే అధికారిక ప్రటకన చేయనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా సెప్టెంబ‌ర్ 28కి రిలీజ్ కావాల్సింది. కానీ, సీజీ వర్క్ పెండింగ్ కార‌ణాల వ‌ల్ల సినిమా వాయిదా పడింది.

ఈ సినిమా షూట్ తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాని స్టార్ట్ చేయనున్నాడు. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తాజాగా ఆమె చేతికి ఈ పెద్ద ప్రాజెక్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించిననున్న ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇటీవలే హను రాఘవపూడి శ్రీలీలకు కథ వినిపించినట్టు టాక్ నడుస్తోంది.

Also Read:మధుమేహాన్ని గుర్తించే లక్షణాలు ఇవే!

కాగా ప్రేమ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. శ్రీలీల పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందట. అన్నట్టు ప్రభాస్ మైనపు విగ్రహం పై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక ఇందులో ప్రభాస్ నటించిన అమరేంద్ర బాహుబలి పాత్ర మైనపు విగ్రహాన్ని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్‌లోనూ ఏర్పాటు చేశారు. తాజాగా మైసూర్‌లోని వాక్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్నిపెట్టడంపై నిర్మాత శోభు యార్లగడ్డ ఫైర్ అయ్యారు. అది ప్రభాస్ విగ్రహం కాదని, వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తొలగించకపోతే చర్యలు తప్పవంటూ ట్వీట్ చేశారు.

Also Read:ఆమె అందాలకు ఎంతైనా ఇవ్వొచ్చు అట!

- Advertisement -