టీఆర్ఎస్‌కు మద్ధతు తెలిపిన సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ నేతలు

183
harish rao
- Advertisement -

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు వాణి దేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల పూర్తి మద్ధతు ఇస్తున్నట్లు ఆ సంఘ నేతలు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును కలిసి మద్ధతు తెలుపుతూ తీర్మానించిన ప్రతిని అందజేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల సంఘ బాధ్యుల కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత విధానాన్ని సీఎం కేసీఆర్ పునరుద్ధరిస్తారన్న విశ్వాసం తమకుందన్నారు.

అందుకు మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ పార్లమెంట్ లో తమ పార్టీ ఎంపీలు సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యమిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బోర్లకుంట వెంకటేశ్ నేత, సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్షులు దాముక కమలాకర్, వర్కింగ్ ప్రసిడెంట్ టివి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి భూపతి రావు, ప్రచార కార్యదర్శి రఘునందన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -