ప్రజలకు నిజాలు చెప్పండి: సీపీఐ నారాయణ

56
cpi
- Advertisement -

కనుమ పండుగ రోజు కూడా కటోరా వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ పేర్కొన్నారు. నగరి లో తనను కలిసిన మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరపు నుండి నన్నొక్కడినే ఆహ్వానించారని చిరంజీవి చెప్పడం, అందుకే తాను వెళ్లి ముఖ్యమంత్రిని కలిసానని చెప్పారని తెలిపారు.

అయితే ప్రభుత్వం తరపున “తాము ఎవ్వర్ని ఆహ్వానించ లేదని,చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని, ప్రతిపక్షాలు అనవసరపు గోల చేస్తోందని ప్రభుత్వం చెబుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి నిజం చెప్పారా? అబద్ధం చెప్పారా? ప్రభుత్వం చెప్పింది నిజమా?అబద్దమా? ప్రజలకు వాస్తవాలు చెప్పడంటూ నారాయణ డిమాండ్ చేశారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యకు సంబంధిత అసోసియేషన్లను తీసుకువచ్చి చర్చించకుండా వ్యక్తిగతంగా ఒకరిని తీసుకు వచ్చి మాట్లాడడం చెడు సాంప్రదాయానికి దారితీస్తుందని సలహా ఇచ్చారు.

- Advertisement -