బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన నారాయణ…ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫెడరల్ స్పూర్తిని దెబ్బ తీస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చాలన్నదే బీజేపీ సిద్ధాంతమా అని ప్రశ్నించారు. కేంద్రంలో ఏ పార్టీ ఉంటే రాష్ట్రాల్లో అదే పార్టీ అధికారంలో ఉండాలన్నది ఎక్కడాలేదని వెల్లడించారు. మోదీ హయాంలో 24 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని చెప్పారు. 28 మంది బ్యాంకులకు రూ.20 లక్షల కోట్లు కొల్లగొట్టి పారిపోయారని చెప్పారు.
మోదీ ప్రధాని అయిన తర్వాత రూ.85 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని దీనికి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మేకప్ కోసం నెలకు రూ.75 లక్షలు ఖర్చుపెట్టే ప్రధానిని, ఒక్కరోజు 14 డ్రెస్సులు మార్చే పీఎంని ఇంతవరకు ఎప్పుడైనా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.