మెగా జాబ్ మేళా ను ప్రారంభించిన హైదరాబాద్ సీపీ

222
job mela
- Advertisement -

సైదాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో చంపాపేట లక్ష్మారెడ్డి గార్డెన్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉద్యోగ మేళా ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో పలు చోట్ల నిర్వహించిన జాబ్ మేళా ద్వారా ఇప్పటికే 4వేల మందికి పైగా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించామని ,అందుకు ఈస్ట్ జోన్ పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నానని తెలిపారు.ఈ రోజు చేపట్టిన జాబ్ మేళా కు 2వేల మంది నిరుద్యోగ యువత హాజరయ్యారని ,500 మందికైనా రిక్రూట్మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

- Advertisement -