శ్రీశైలంలో సర్వదర్శనం నిలిపివేత..

47
srisailam
- Advertisement -

శ్రీశైలం ఆలయంలో నేటి నుంచి కొత్త ఆంక్షలు అమలులో రానున్నాయి.కోవిడ్ నేపధ్యంలో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు నేటి నుంచి స్వామి వారి సర్ప దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ఎస్.లవన్న తెలిపారు. సర్వదర్శనంతో పాటు అన్న ప్రసాద వితరణ, పాతాళ గంగలో పుణ్య స్నానాలు తాత్కాలికంగా నిలుపుదల చేశామని ఈవో వెల్లడించారు.

రోజుకు 4 విడతల్లో సామూహిక అభిషేకాలు నిర్వహించుకునే లా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 18 నుంచి ఆర్జిత సేవల టిక్కెట్లు ఆన్ లైన్ ద్వారా భక్తుల టికెట్లు పొందాల్సి ఉంటుందని…. శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం టికెట్లు కూడా ఆన్ లైన్ ద్వారా పొందే అవకాశం ఉందన్నారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్​కు కొవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేసినట్లు తెలిపారు. గంటకు 1000 మంది భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు …ఆర్జిత సేవలు కూడా 50 శాతంతో అమలు చేస్తున్నామన్నారు. ఉచిత దర్శనానికి ఆన్ లైన్ లో ముందస్తుగా నమోదుకు అవకాశం ఉందని తెలిపారు.

- Advertisement -