క‌ర్ణాట‌క‌లో క‌రోనా కల్లోలం..

182
corona in karnataka
- Advertisement -

క‌ర్ణాట‌క‌ రాష్ట్రంలో క‌రోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధ‌వారం కొత్త‌గా 397 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల మార్కును దాటి 10,118కి చేరింది. ఇక బుధ‌వారం కొత్త‌గా 14 మంది క‌రోనా బాధితులు మృతిచెంద‌డంతో మొత్తం మృతుల సంఖ్య 164కు చేరింది.

మొత్తం కేసుల‌లో 6,151 మంది డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జిలు, మ‌ర‌ణాలు పోగా మిగిలిన వారు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నట్లు క‌ర్ణాట‌క ఆరోగ్యశాఖ తెలిపింది.రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో బెంగుళురులోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్‌లో విధించారు.

- Advertisement -