కరోనా.. శ్రీశైలం టెంపుల్ మూసివేత..

476
Srisailam Temple
- Advertisement -

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ఆలయాలు మూసివేస్తున్నాట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రముఖ ఆలయాలు బంద్‌ చేశారు. తాజాగా కరోనా ప్రభావం శ్రీశైల దేవాలయంపై పడింది.

శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల క్షేత్రంలో ఈ రోజు మధ్యాహ్నం నుండి దర్శనాలు పూర్తిగా నిలిపివేస్తున్నామని ఈవో కేఎస్ రామారావు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు వెనుతిరిగి వెళ్ళిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -