24 గంటల్లో 1,334 కరోనా కేసులు..

190
corona
- Advertisement -

కోవిద్-19 భారత్‌లో విజృంభిస్తోంది. దీంతో లాక్ డౌన్ మే 3వరకు విధించారు. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,334 కరోనా కేసులు నమోదు కాగా 27 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15,712కు చేరింది.

కరోనా బారిన పడి ఇప్పటి వరకు 507 మంది మృతిచెందారు. కరోనా నుంచి కోలుకొని 2,231 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. భారత్‌లో ఇవాళ్టి వరకు 3.86 లక్షల మందికి కరోనా టెస్టులు చేయగా 24గంటల వ్యవధిలోనే 37వేల టెస్టులు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -