ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కోవిడ్ సేవలు

194
- Advertisement -

కొవిడ్ కేసులు పెరగడంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా పూర్తి స్థాయిలో కొవిడ్ సేవలు వినియోగించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కోటి లోని కమాండ్ కంట్రోల్ రూం లో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు. కరోనా చికిత్స ఏర్పాట్లను సమీక్షించనున్నారు.

2 గంటలకు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాలతో, 3 గంటలకు ప్రైవేట్ నర్సింగ్ హోం అధిపతులతో మంత్రి ఈటల రాజేందర్ భేటీ కానున్నారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరినీ అప్రమత్తం చేయనున్నారు.

- Advertisement -