1061కి చేరిన కరోనా కేసులు..

250
Coronavirus Telangana
- Advertisement -

తెలంగాణలో కరోనా కేసులు 1061కి చేరాయి. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 17 కేసులు నమోదయ్యాయి. వీటిలో 15 జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండగా రెండు రంగారెడ్డి జిల్లాలో నమోదయ్యాయి.

కరోనాతో శనివారం ఒకరు మృతిచెందారని దీంతో ఇప్పటివరకు మరణించిన వారిసంఖ్య 29కి చేరింది. ఇప్పటి వరకు 499 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 533 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

- Advertisement -