దేశంలో పెరుగుతున్న కరోనా‌ కేసులు..

444
corona
- Advertisement -

భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తి, మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో ఇప్పటివరకు ఏ రోజూ నమోదు కానంత అధికంగా మృతుల సంఖ్య నమోదయింది.

కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 40వేలు దాటాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 2487 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 83 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆదివారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 40,263కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 28,070 మంది చికిత్స పొందుతున్నారు. 10887 బాధితులు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈరోజు వరకు 1306 మంది కరోనా వల్ల చనిపోయారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

- Advertisement -