దేశంలో 8,356 కు చేరిన కరోనా కేసుల సంఖ్య..

462
lav agarwal
- Advertisement -

భారత్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ కరోనా ప్రస్తుత పరిస్థితులపై ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వైరస్‌ అదుపులో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

అయితే పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 909 కరోనా కేసులు నమోదయ్యాయని, 34 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,356కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 273 మంది మరణించారు.

కరోనా వచ్చిన వారిని, కలిసిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా పరీక్షల సామర్థ్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతున్నాం. ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ కరోనా పరీక్షలకు అనుమతి ఇస్తున్నాం. ఇప్పటి వరకు 1.80 లక్షల శాంపిల్స్‌ టెస్టు చేశాం. 151 ప్రభుత్వ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు చేస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల సేవలు కూడా ఉపయోగించుకుంటున్నాం. ఆస్పత్రులు, ఐసోలేషన్‌ కేంద్రాల సంఖ్యను పెంచుకుంటున్నామని లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

- Advertisement -