తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు…

230
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజుకు దాదాపు 2 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతుండటంతో కరోనా టెస్టుల సంఖ్యను పెంచింది ప్రభుత్వం. రెండు రోజుల్లో దాదాపు 11 వేలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించగా 1178 మందికి కరోనాపాజిటివ్ తేలింది.

దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,402 కి చేరగా ఇందులో 12,135 కేసులు యాక్టివ్ గా ఉండగా, 20,919 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 348కి చేరింది.

గత 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 736 కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం వరకు వరకు జీహెచ్ఎంసిలో రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదుకాగా ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

- Advertisement -