బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

71
- Advertisement -

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న(72)ఆదివారం కన్నుమూశారు. సాయన్న గత కొంతకాలంగా గుండె కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. షుగర్ లెవల్స్ బాగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఉదయం సాయన్నను యశోద ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

సాయన్న టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి…ఐదుసార్లు కంటోన్మెంట్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ తరపున 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచారు. 2014 తర్వాత సాయన్న బీఆర్ఎస్‌లో చేరారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మరోసారి కంటోన్మెంట్‌ నుంచి గెలిచారు. కానీ 2009లో కాంగ్రెస్‌ నేత శంకర్‌రావు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.

ఇవి కూడా చదవండి…

వేములవాడ…రెండంతస్తుల మార్కెట్‌

మత విద్వేషం.. బీజేపీ తంత్రం!

వైఎస్‌ షర్మిల అరెస్ట్‌..

- Advertisement -