సుఖశాంతుల తెలంగాణ-సుభిక్షంగా ఉండాలి:గవర్నర్

300
Governor-E.S.L.-Narasimhan
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర 5వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ప్రజలకు శుభాకాంక్షలు,అభినందనలు తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమ మరియు అభివృద్ధి కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు చేపట్టిన కార్యక్రమాలు కొనసాగించాలని సూచించిన నరసింహన్.. సంక్షేమ మరియు అభివృద్ధి ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు అందేలా చూడాలన్నార. ప్రజల సంతోషమే ప్రభుత్వ విజయాలకి కొలబద్ధత అన్నారు.

రాబోయే రోజులలో ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ నిబద్ధతతో, పారదర్శకంగా అందరికీ అందేలా చూడాలన్నారు. బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వానికి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఆకాక్షించిన గవర్నర్ “సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలన్నారు.

- Advertisement -