మొక్కలు నాటిన ఇరాన్ కాన్సులేట్ జనరల్ మాడి శాహ్రొఖి…

180
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు బంజారాహిల్స్ లోని తమ కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటారు ఇరాన్ కాన్సులేట్ జనరల్ మాడి శాహ్రోఖి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించాలి బాధ్యత మనందరిపై ఉందని. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ రక్షణ కోసం ఎవరికివారు కృషి చేయాలని తెలిపారు. త్వరలోనే మా ఇరాన్ కాన్సులేట్ జనరల్ కు రాజ్యసభ సభ్యులు సంతోష్ గారిని ఆహ్వానించి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరాన్ కాన్సులేట్ జనరల్ అధికారులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ నుండి డాక్టర్ రవీందర్ రెడ్డి, రాఘవ, కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -