రేవంత్‌పై సీనియర్ల గుస్సా..ఫిర్యాదు!

48
congress
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌ తీరుపై గుస్సాగా ఉన్న సీనియర్లు పొన్నాల,వీహెచ్‌,జగ్గారెడ్డి,శ్రీధర్ బాబు,గీతారెడ్డి తదితరులు ప్రత్యేకంగా సమావేశమై అధిష్టానికి ఫిర్యాదుచేయాలని నిర్ణయించారు.

రేవంత్ త‌న ఒంటెద్దు పోక‌డ‌ల‌తో వ‌న్‌మెన్ షో చేస్తున్నార‌ని…ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే పార్టీ పూర్తిగా ఒక్క‌రి చేతుల్లో బందీ అవుతుంద‌నే సీనియర్లు అభిప్రాయపడ్డారు. వీహెచ్‌ తన‌కు మంచిర్యాల‌లో జ‌రిగిన అవ‌మానం ఉద్దేశపూర్వ‌కంగానే జ‌రిగింద‌ని పేర్కొన్న‌ట్లు స‌మాచారం.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జంగా రాఘ‌వ‌రెడ్డి పెత్త‌నం ఎక్కువైంద‌ని.. త‌న‌కు స‌మాచారం లేకుండా కార్య‌క్ర‌మాలు జ‌రిగిపోతున్నాయ‌ని పొన్నాల సీరియస్ అయ్యారు. మర్రి శశిధర్ రెడ్డి సైతం రేవంత్ తీరుపై ఆవేదన వ్యక్తం చేయగా దీనిపై అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో భేటీ కావాల‌ని నిర్ణయించడం రేవంత్ వర్గానికి మింగుడుపడటం లేదు.

- Advertisement -