కాంగ్రెస్ గుంపులో ఉండను..అధిష్టానికి జగ్గారెడ్డి లేఖ

97
jaggareddy
- Advertisement -

కొంతకాలంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుతో గుర్రుగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరో అడుగుముందుకేశారు. పార్టీ అధిష్టానానికి లేఖ రాస్తూ ఈ లేఖ విడుదలైనప్పటి నుండి తాను కాంగ్రెస్ గుంపులో ఉండనని తేల్చిచెప్పారు. మూడు పేజీల లేఖతో కూడిన లేఖను అధినేత్రి సోనియా గాంధీ, సీనియ‌ర్ నాయ‌కులు రాహుల్ గాంధీకి రాశారు.

త్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాన‌ని…కాంగ్రెస్ పార్టీని వీడిన గాంధీ కుటుంబంపై గౌర‌వంతో ఉంటాన‌ని పేర్కొన్నారు. త్వరలో పార్టీ పదవికి , కాంగ్రెస్ పార్టీ ప్రాథ‌మిక‌ సభ్యత్వానికి రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న తేల్చిచెప్పారు.

రేవంత్ రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. సొంత పార్టీలోనే కుట్రపూరితంగా కాంగ్రెస్ కోవర్టుగా ముద్రవేస్తున్నారు. ఇది బాధ క‌లిగించే విష‌య‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని కొందరు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రచారం చేయిస్తున్నార‌ని…అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి ప్రజలకు స్వతంత్రంగా సేవ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. 2017లో రాహుల్ గాంధీ స‌భ పెట్టేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోతే.. కోట్ల రూపాయాలు ఖ‌ర్చు పెట్టి స‌భ నిర్వ‌హించానని జ‌గ్గారెడ్డి లేఖ‌లో గుర్తు చేశారు.

- Advertisement -