మోదీ డైరెక్ష‌న్‌లోనే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌జా ద‌ర్బార్- జగ్గారెడ్డి

63
jagga reddy
- Advertisement -

రాజ్‌ భవన్‌ లో శుక్రవారం గ‌వ‌ర్న‌ర్ తమిళిసై ప్ర‌జా ద‌ర్బార్‌ నిర్వ‌హించిన విషయం తెలిసిందే. ఆమె గవర్నర్‌ హోదాలో ఈ ప్రజా ద‌ర్బార్ నిర్వహించాడంపై పలు రాజకీయ నేతలు స్పందించారు. ఈ కార్యక్రమంలో ముగిసిన వెంట‌నే దానిపై టీఆర్ఎస్ విమ‌ర్శ‌లు గుప్పించింది. తాజాగా టీకాంగ్రెస్ పార్టీ కూడా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌జా ద‌ర్బార్‌ను తప్పుబట్టింది.

ఈమేరకు కాంగ్రెస్‌ సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌జా ద‌ర్బార్‌ను విమ‌ర్శిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, ప్ర‌ధాని నరేంద్ర మోదీల డైరెక్ష‌న్‌లోనే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌జా ద‌ర్బార్ జ‌రిగింద‌ని ఆరోపించారు. నామ‌మాత్ర‌పు ద‌ర్బార్‌ల‌తో మ‌హిళ‌లకు ఒరిగేదేమీ లేద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

- Advertisement -