కాంగ్రెస్‌కు షాక్‌.. టీఆర్‌ఎస్‌లో చేరనున్న కీలక నేత..

121
- Advertisement -

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు చల్మెడ లక్ష్మీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను ఏఐసిసి ప్రెసిడెంట్ సోనియాగాంధీకి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన టిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల ఎనిమిదో తేదీ మధ్యాహ్నం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ..రెండు సార్లు పోటీ చేసినా కూడా పార్టీలో కొందరు నా ఓటమికి సహకరించారని..రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని గ్రహించి సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని టిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు నరసింహారావు తెలిపారు.

- Advertisement -