తొలి రోజు మూడు నామినేషన్లు దాఖలు

217
chennareddy
- Advertisement -

మహబూబ్ నగర్- రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి గాను నామినేషన్లు ప్రారంభమైన మొదటి రోజు మంగళవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా కు భారతీయ జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా డా.జి.చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా సయ్యద్ ఫరిదుద్దీన్, అడపా సురేందర్ లు నామినేషన్లు దాఖలు చేశారు.

ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. కాగా ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లను ఆన్ లైన్ విధానంలో స్వీకరించడం ఉండదని, నేరుగా రిటర్నింగ్ అధికారికే నామినేషన్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి డి.ఎస్.లోకేష్ కుమార్ స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికపై జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూం కు ఆన్ లైన్ నామినేషన్లను అందించడంపై పలువురు వాకబు చేస్తున్నారని, అయితే ఈ ఎన్నికలకు నామినేషన్లను నేరుగా సమర్పించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కై 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ పోలింగ్ కేంద్రాలన్నింటిలోనూ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. కాగా పోలింగ్ నిమిత్తం సరిపడా బ్యాలెట్ బాక్స్ లను సిద్దం చేసుకోవాలని అధికారులను లోకేష్ కుమార్ ఆదేశించారు.

- Advertisement -