కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మోదీ..

115
pm modi
- Advertisement -

ఓట్ల కోసం కాంగ్రెస్‌ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. మార్చి 27 నుంచి అసోం అసెంబ్లీకి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని అసోంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్‌ ఫ్రంట్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌.. కేరళలో అదే పార్టీతో తలపడుతోందంటూ ఆ పార్టీ విధానాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడిందని.. ఓట్ల కోసం ఎవరి కోసమైనా చేతులు కలిపేందుకు సిద్ధమైందన్నారు మోదీ.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసోం నిరాదరణకు గురైందన్నారు. ఆ పార్టీ నాయకుల అవినీతి, అక్రమాల వల్ల రాష్ట్రం ఇతర ప్రాంతాలతో అనుసంధానాన్ని కోల్పోయిందని మోదీ ఆరోపించారు. బీజేపీ మాత్రం అసోం ప్రజల్ని మిగతా దేశంతో ఏకం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు సైతం భారీ ఎత్తున ఊపందుకున్నాయన్నారు. ఇప్పటికే సిల్చార్‌లో మల్టీ మోడర్‌ లాజిస్టిక్ పార్క్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయన్నారు. దీని వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. అలాగే ఇటు రాష్ట్రంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు మెరుగైన ఆరోగ్య వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఆయుష్మాన్‌ యోజన పథకం కింద ఇప్పటి వరకు అసోంలో 1.5 లక్షల మంది ఉచిత వైద్యం పొందారన్నారు. అలాగే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా 27 లక్షల మంది రైతులు లబ్ధి పొందారన్నారు.

- Advertisement -