టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయకులు..

137
Minister Prashanth Reddy
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై భారీగా యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు జక్కుల కార్తిక్ ఆధ్వర్యంలో భారీగా యువకులు బీజేపీ, ఇతర పార్టీల నుండి మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్యాకేజ్-21 ద్వారా ముచ్కూర్ గ్రామానికి 2100 ఎకరాలకు సాగు నీరు, కప్పల వాగుపై నిర్మిస్తున్న చెక్‌ డ్యామ్‌లు, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరారని తెలిపారు.పార్టీలో చేరిన వారిలో కర్రోళ్ల రాకేష్,కోడిగేల రాకేష్,మగ్గిడి హరీష్,చింతకింది నర్సయ్య,అన్నారం రాజేశ్వర్,హరీష్,బూరెడ్డి సుశీల్,బద్దం సంపత్,అదే తేజ,బొడ్డు ప్రశాంత్ తదితరులు పార్టీలో చేరారు..ఈ కార్యక్రమంలో ఎంపిపి మహేష్,ఉప సర్పంచ్ భూమేష్,ముచ్కూర్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్ పాల్గొన్నారు.

- Advertisement -