బాలీవుడ్‌కు మహానటి..!

326
keerthy suresh
- Advertisement -

‘నేను శైలజ’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ కీర్తి సురేష్‌. తొలి సినిమాతోనే తెలుగువారి మనసు దోచుకున్న కీర్తి తర్వాత నాని హీరోగా వచ్చిన ‘నేను లోకల్‌’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మహానటితో ప్రేక్షకులను మెప్పించింది. సావిత్రిగా ఒదిగిపోయిన కీర్తి…తనదైన నటనతో ఆ మహానటినే మరిపించింది. ప్రస్తుతం టాలీవుడ్‌,కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి త్వరలోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది.

ప్రస్తుతం ‘తానాజీ’ సినిమాతో బిజీగా ఉన్న అజయ్ దేవగన్.. ఈ చిత్రం తరవాత ఓ బయోపిక్‌లో నటించనున్నారు. 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథను అజయ్ దేవగన్ తెరపై ఆవిష్కరించనున్నారు. ఈ మూవీలో అజయ్ దేవగన్ సరసన నటించే ఛాన్స్‌ను కీర్తి సురేష్ కొట్టేసింది.

‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహిస్తుండగా బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. జూన్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుండగా కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా ఎంపికచేసిన విషయాన్ని ధృవీకరిస్తూ ప్రముఖ మూవీ అనలిస్ట్ రమేష్ బాలా ట్వీట్ చేశారు. ఇక ఇప్పటికే తెలుగు,తమిళ తెరపై వెలుగువెలుగుతున్న కీర్తి బాలీవుడ్‌ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచిచూడాలి.

- Advertisement -