- Advertisement -
మంచు మోహన్ బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణుపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు నాయి బ్రహ్మణ సంఘం నేతలు. కర్నూలులోని మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. 11ఏండ్లుగా మోహన్ బాబు వద్ద హెయిర్ స్టయిలిస్ట్గా పనిచేస్తున్న నాగశ్రీను అనే వ్యక్తిని కులంపేరుతో దూషించారని …వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
మోహన్ బాబు, అతడి కుమారుడు మంచు విష్ణు నాయీ బ్రాహ్మణులకు, బీసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, వారిద్దరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల సన్ ఆఫ్ ఇండియా చిత్రంపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న కారణంగా నాగశ్రీనును ఇంట్లో పనివాళ్ల ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి దుర్భాషలాడారని సంఘాల నాయకులు ఆరోపించారు.
- Advertisement -