కల్నల్‌ సంతోష్‌ బాబు కాంస్య విగ్రహ ఆవిష్కరణ

203
santhu
- Advertisement -

నేడు సంతోష్ ఆబు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి. సంతోష్‌బాబు ప్రథమ వర్థంతి సందర్భంగా మంగళవారం విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. 2020, జూన్‌ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతో్‌షబాబుతో పాటు మరి కొంతమంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతో్‌షబాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కల్నల్‌ సంతో్‌షబాబు కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చే సింది. హైదరాబాద్‌ జేఎన్టీయూ ఫైన్‌ఆర్ట్స్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో కాంస్య విగ్రహాన్ని తయారు చేయించింది. ఇందుకు మునిసిపల్‌ శాఖ నుంచి 21లక్షలు సమకూర్చారు. 80కిలోల బరువు, తొమ్మిది అడుగుల విగ్రహాన్ని రూపుదిద్దారు.

- Advertisement -