ఏపీ విద్యుత్ సంస్థలు తొందరపడ్డాయి: ప్రభాకర్ రావు

254
cmd prabhakarrao
- Advertisement -

ఉద్యోగుల విభజన విషయంలో ఏపీ విద్యుత్ సంస్థలు తొందరపడ్డాయనితెలిపారు ట్రాన్స్‌కో, జేన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. సుప్రీం కోర్టు వన్ మెన్ కమిటీ వేసిందని…. ఉద్యోగుల విభజనకు సంబంధించిన తుది నివేదిక కూడా ఇచ్చిందన్నారు.

ధర్మాధికారి ఇచ్చిన తుది నివేదిక అమలు చేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని…ఏపీ 584 మంది విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేసిందని చెప్పారు. ధర్మాధికారి సూచనల మేరకే తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులను తీసుకుంటాం అన్నారు.

ధర్మాధికారికి ఉద్యోగుల పంపకాలపై లేఖ రాశాము, రిప్లై రాలేదని చెప్పారు. ఏపీ విద్యుత్ ఉద్యోగుల లిస్ట్ ధర్మాధికారికి ఇవ్వాల్సి ఉండే.. కానీ ఇవ్వలేదన్నారు.

- Advertisement -