చిన్నారులకు పోలియో చుక్కల వేసిన సీఎం..

152
cm jagan
- Advertisement -

ఈరోజు దేశవ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలియో చుక్కల ప్రారంభమైంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ పల్స్ పోలియో షురూ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. పలువురు చిన్నారులను ఆప్యాయంగా ఎత్తుకున్న సీఎం జగన్ వారితో ముచ్చటించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -