టాలీవుడ్‌పై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు..

188
kcr cm
- Advertisement -

ఇటీవల చిరంజీవి, నాగార్జున తదితర సినీ పెద్దలు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి టాలీవుడ్‌ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అయితే తాజా టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. ఇన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో కుదేలవుతున్న టాలీవుడ్‌కు కేసీఆర్ బాసటగా నిలుస్తున్నారు.

రూ.10 కోట్ల లోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్ మెంట్ కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల యాజమాన్యాలు షోలు పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చారు. అంతేకాకుండా, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న విధంగా సినిమా టికెట్ రేట్లు సవరించుకునేందుకు అనుమతినిస్తున్నట్టు తెలిపారు. 40 వేల సినిమా కార్మికులకు రేషన్ కార్డులు ఇచ్చాడు.

ముఖ్యంగా, జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లకు ఇతర వ్యాపార సంస్థల తరహాలో ఉండే హెచ్ టీ, ఎల్టీ కేటగిరీ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి కనీస డిమాండ్ చార్జీలను రద్దు చేశారు. కరోనాతో కుదేలైన మరో రంగం చిత్ర రంగం అని, చిత్రనిర్మాణానికి పెట్టింది పేరైన మన సినీ పరిశ్రమ పునరుద్ధరణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. తమ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు కేసీఆర్.

- Advertisement -