ఎంపీ స్థానాల్లో గెలుపుకు కృషిచేయాలి:సీఎం రేవంత్

39
- Advertisement -

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ MCRHRDలో ఐదు జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో ముగిసింది సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.
జిల్లాల వారీగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 26 తరువాత జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ వెళ్లనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ జరగనుండగా గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి సభ ఇంద్రవెల్లిలో నిర్వహించనున్నారు రేవంత్. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనం కోసం శంఖుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామన్నారు సీఎం. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలు ఉమ్మడి జిల్లాల ఇంచార్జి మంత్రులకు అప్పజెప్పారు. సంక్షేమం, అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని భరోసా ఇచ్చారు సీఎం.

తాను గత సీఎంలా కాదని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్. జనవరి 26 తరువాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు రేవంత్. వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని తెలిపారు సీఎం. పార్లమెంటు ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. 17 లో 12కు తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలిపించుకోవాలన్నారు సీఎం.

Also Read:ప్రభాస్ ‘కల్కి’ ఓ కొలిక్కి తెచ్చాడు

- Advertisement -