పద్మ పురస్కారాల్లో వివక్ష: రేవంత్ రెడ్డి

13
- Advertisement -

2025 పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. పద్మ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని సీఎం రేవంత్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్‌, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్‌ తిరుమలరావు వంటి ప్రముఖులకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని చెప్పారు. 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం తెలంగాణకు కనీసం ఐదు అవార్డులు కూడా ఇవ్వలేదన్నారు. ఈమేరకు ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌ లేఖ రాశారు.

పద్మ పురస్కారాల్లో తెలంగాణ నుంచి డాక్టర్‌ డీ.నాగేశ్వర్‌ రెడ్డి, మందకృష్ణ మాదిగ మాత్రమే ఉన్నారు. ప‌ద్మవిభూష‌ణ్‌, సినిమా రంగంలో త‌న‌దైన ముద్ర వేసిన నంద‌మూరి బాల‌కృష్ణకు ప‌ద్మ భూష‌ణ్‌, ప్రజా వ్యవ‌హారాల విభాగంలో మంద కృష్ణ మాదిగ‌కు, క‌ళలు, సాహిత్యం, విద్యా విభాగాల్లో కేఎల్.కృష్ణ‌, మాడుగుల నాగ‌ఫ‌ణిశ‌ర్మ‌, దివంగ‌త మిర్యాల అప్పారావు, రాఘ‌వేంద్రాచార్య పంచ‌ముఖిల‌కు ప‌ద్మశ్రీ పుర‌స్కారాలు ద‌క్కడంపై హ‌ర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్.

Also Read:బాలకృష్ణకు పద్మభూషణ్.. మందకృష్ణకు పద్మశ్రీ

- Advertisement -