నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవు

2
- Advertisement -

జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దని తెలిపారు సీఎం.

ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు రేవంత్. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తిస్థాయి రిపోర్ట్ 15రోజుల్లోగా అందించాలని…తప్పుడు రిపోర్ట్ లు ఇస్తే అధికారులపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడంలో ట్రాన్స్ జెండర్ లను వాలంటీర్స్ గా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని…హోమ్ గార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలలన్నారు. ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించాలని అధికారులకు ఆదేశించారు.

Also Read:Harishrao:గాంధీతో దాడి చేయించింది రేవంతే

- Advertisement -