పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త ఏటీసీలు..

1
- Advertisement -

పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్మిక, ఉపాధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా మారుస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు సీఎం.

ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ ను అప్ గ్రేడ్ చేయాలన్నారు సీఎం. సిలబస్ మార్పుకు కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశం ఇచ్చారు. అవసరమైతే స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలన్నారు సీఎం.

పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్న సీఎం..ఐటీఐలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి రిపోర్ట్ సమర్పించాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నీక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలన్నారు.

Also Read:TTDకి విజయ డైరీ పాల ఉత్పత్తులు

- Advertisement -