హైదరాబాద్‌కా నిషాన్ నుమాయిష్

28
- Advertisement -

హైదరాబాద్‌కా నిషాన్ నుమాయిష్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మాట్లాడిన రేవంత్..దేశంలో హైదరాబాద్ అంటే చార్మినార్.. ట్యాంక్ బండ్ తరువాత గుర్తొచ్చేది నుమాయిష్ అన్నారు.

ప్రతీ ఏటా నుమాయిష్ ప్రాధాన్యత తగ్గకుండా నిర్వహిస్తున్న సొసైటీకి అభినందనలు తెలిపారు.కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీగా అప్ గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం తరపు నుంచి మా పూర్తి సహకారం ఉంటుందన్నారు.సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చేందుకు నుమాయిష్ ను ముందుకు తీసుకెళ్లేందుకు అండగా ఉంటాం అని…మీ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు.

Also Read:BRS:బి‌ఆర్‌ఎస్ ముందు బిగ్ టాస్క్?

- Advertisement -