డీఎస్ మృతి..తెలుగు సీఎంల సంతాపం

11
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డి శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం తెలిపారు సీఎం చంద్రబాబు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డీఎస్ మంత్రిగా, ఎంపిగా తనదైన ముద్ర వేశారని అన్నారు. శ్రీనివాస్ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసేవారని.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని కొనియాడారు.

డీఎస్‌ మృతిపట్ల సీఎం రేవంత్‌ రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్, కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. డి.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

Also Read:కల్కిలో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ

- Advertisement -