Revanth:రుణమాఫీ చేసి తీరుతాం

15
- Advertisement -

వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీపై కేబినెట్ లో చర్చించాం..రుణమాఫీ చేసి తీరుతాం అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానం అని సచివాలయంలో వెల్లడించారు.మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గే..కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలా శాసనం..ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.

గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన రుణమాఫీ రూ.28వేల కోట్లు..గత ప్రభుత్వం 11డిసెంబర్ 2018 వరకు కటాఫ్ తేదీతో రుణమాఫీ చేసింది…మా ప్రభుత్వం 12డిసెంబర్ 2018 నుంచి 9డిసెంబర్ 2023 మధ్యకాలంలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించిందన్నారు.రుణమాఫీకి దాదాపు రూ.31వేల కోట్లు అవసరమవుతోందని…రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రుణమాఫీ చేయాలని నిర్ణయించిందన్నారు.

గత ప్రభుత్వం పదేళ్లలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని…మా ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోందన్నారు.రైతు భరోసాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి..రోడ్లు, కొండలు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, ధనికులకు రైతు భరోసా ఇస్తున్నారని చర్చ జరుగుతోందన్నారు. అందుకే రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం నియమించాం..ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల,శ్రీధర్ బాబు, పొంగులేటి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని నియమించాం అన్నారు.

జూలై 15లోగా కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది..ఈ నివేదికను శాసనసభలో పవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తాం అన్నారు. మంత్రివర్గ నిర్ణయాలు, ప్రభుత్వ పరిపాలనపరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యత శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటారని…వారిద్దరు ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారం అన్నారు.సమచారం ప్రసారం చేసేముందు మీడియా మిత్రులు ఇది గమనించాలని…రుణమాఫీపై తినబోతూ రుచులెందుకు అన్నారు. నియమ నిబంధనలకు సంబంధించి జీవోలో అన్నీ పొందుపరుస్తాం అన్నారు.
Also Read:సుఖనిద్ర కోసం..ఈ పొజిషన్ ట్రై చేయండి!

- Advertisement -