గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న సీఎం వ్యక్తిగత కార్యదర్శి..

256
CM Personal Secretary
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ పుట్టినరోజు పురస్కరించుకొని సంతోష్ పిలుపుమేరకు గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా నేడు ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి వెంకట్ నారాయణ మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్ నారాయణ మాట్లాడుతూ.. సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంతోష్ ఒక మంచి ఆలోచన చేశారని తెలిపారు.

pm santhosh

నేటి మొక్కలే రేపటి భవిష్యత్తు తరాలకు మహావృక్షాలు అవుతాయని ఇవే మన భవిష్యత్ తరాలకు అందించే గొప్ప సంపద అని తెలిపారు. దీనిని ఆదర్శంగా తీసుకొని మీము కూడ భవిష్యత్తులో మొక్కలు పెంచే బాధ్యతను తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -