ప్రతి ఒక్కరి బాధ్యత మొక్కలు నాటడం: ఓఎస్డీ ప్రియాంక

85
priyanka
- Advertisement -

దేశవ్యాప్తంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ద్వారా మొక్కలు నాటడం జోరుగా కొనసాగుతొంది. ఈ కార్యక్రమంలో ప్రముఖుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా తన పుట్టిన రోజు పురస్కరించుకుని కొంపల్లిలోని తన నివాసంలో మొక్కలు నాటిన సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్.

ఈ సందర్భంగా ప్రియాంక వర్గిస్ మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా పచ్చదనం పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగం చేసినందుకు ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఙతలు తెలిపారు.

- Advertisement -