సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఒడిశా ముఖ్యమంత్రి

358
Cm Kcr Naveen Patnaik
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. ఈమేరకు ఆయన ఇవాళ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. తీవ్ర తుఫానుగా మారిన ‘ఫణి’ ఒడిశాను ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ తుఫాను వల్ల చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తుఫాను బారిన పడిన ప్రజలకు ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సాయం చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణ సర్కార్ అందించిన సాయానికి నవీన్ పట్నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణలో నిపుణులైన తెలంగాణ సిబ్బంది అందించిన సేవలు ప్రశంసనీయామని, ఒడిశాలో వీలైనంత త్వరగా విద్యుత్ ను ప్రజలకు అందించడంలో తెలంగాణ విద్యుత్ సిబ్బంది కృషి అభినందనీయామని నవీన్ పట్నాయక్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు రుణపడిఉంటామని చెప్పారు.

naveen Patnaik Leter to cm Kcr

- Advertisement -