ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌..

306
cm kcr
- Advertisement -

తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాళేశ్వ‌రంలో ప‌ర్యటిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కాళేశ్వ‌రం ముక్తేశ్వ‌ర‌స్వామిని కేసీఆర్ దంప‌తులు ద‌ర్శించుకుని, ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అర్చకులు దగ్గరుండి సీఎం దంపతులతో స్వామివారికి అభిషేకం చేయించి, ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.

సీఎం పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ దర్శనం తరువాత మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో కాళేశ్వరం రిజర్వాయర్‌ను పరిశీలించనున్నారు. అక్కడి నుండి లక్ష్మీ బరాజ్‌కు చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగికి సాగునీటి విడుదల తదితర అంశాలపై అధికారులతో ఆయన మాట్లాడనున్నారు. పంటలకు ఇబ్బందులు లేకుండా నీటిని అందించే అంశంపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం సూచ‌న‌లు చేస్తారు.

- Advertisement -