నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ విషెస్..

81
- Advertisement -

బర్మింగ్ హాంలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీల్లోఉమెన్స్ బాక్సింగ్ ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరీన్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, ఆమె విజయపరంపరను అభినందించారు.

జరీన్ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటుందని సీఎం పునరుద్ఘాటించారు.ఈ సందర్భంగా స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్ తో సీఎం కేసీఆర్ గారు స్వయంగా పోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. ‘బంగారు పథకాన్ని సాధించి భారత దేశ గౌరవాన్ని మరింతగా ఇనుమడింప చేశావు..’ అని నిఖత్ జరీన్ ను సీఎం కేసీఆర్ అభినందించారు.

- Advertisement -