నేడు గజ్వేల్ కు సీఎం కేసీఆర్

325
CMKCR
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు గజ్వేల్ లో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని ములుగులో ఉదయం 11గంటలకు తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ, హర్టికల్చర్ యూనివర్సిటీని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఈటెల రాజెందర్ తో పాటు పలువురు అధికారులు పాల్గోననున్నారు. సీఎం పర్యటన సందర్భంగా గజ్వేల్ లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. మంత్రి హరీశ్ రావు దగ్గరుండి ఏర్పాట్లను పరిక్షించారు.

ఇక మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ కు చేరుకొనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సాయంత్ర 5గంటలకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ మంత్రివర్గ భేటీలో పలు కిలక అంశాలపై చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు, ఆర్టీసీ బలోపేతంపై ముఖ్యంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -