సిరిసిల్ల పర్యటనలో సీఎం కేసీఆర్..

532
kcr
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.30గంటలకు సిరిసిల్ల జిల్లాకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం 11.50గంటలరే మిడక మాపూనే డ్యాంను సందర్శించనున్నారు.

ఏరియల్ సర్వే అనంతరం ప్రాజెక్టు పనులపై సమీక్షించనున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్ధాయిలో నిండటం ఇదే మొదటిసారి కావడంతో సీఎం ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1గంటలకు తీగలగుట్ట పల్లి చేరుకొనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు భోజనం చేసిన అనంతరం తిరిగి హైదరాబాద్ కు పయనం కానున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

- Advertisement -