యశోదా ఆసుపత్రికి సీఎం కేసీఆర్‌..

207
cm kcr
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి వెళ్లారు. అయితే సీటీ స్కాన్, ఇతర సాధారణ వైద్య పరీక్షల కోసం ఆయన ఆసుపత్రికి వచ్చారు. దాదాపు గంటన్నర పాటు ఆసుపత్రిలోనే ఆయన వుంటారు. అనంతరం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌‌కు చేరుకుంటారు. సీఎంతో పాటు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. కోవిడ్ బారిన పడిన అనంతరం సీఎం కేసీఆర్‌ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలో ఉన్న తన ఫామ్ హౌస్ లోనే ఆయన చికిత్స తీసుకుంటున్నారు.

- Advertisement -