ఈనెల 11న గజ్వేల్ కు సీఎం కేసీఆర్

461
kcr cm
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 11న గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని ములుగులో ఉదయం 11గంటలకు తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ, హర్టికల్చర్ యూనివర్సిటీని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 5గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ మంత్రివర్గ భేటీలో పలు కిలక అంశాలపై చర్చించనున్నారు.

- Advertisement -